Mahesh Babu: ' సర్కారువారి పాట' కథ వినగానే మహేశ్ ఓకే చెప్పడానికి కారణమదే: పరశురామ్

  • 'సర్కారువారి పాట' ప్రమోషన్స్ లో పరశురామ్
  • కథ వినగానే మహేశ్ ఓకే చెప్పారట 
  • ఆయన పాత్ర యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుందన్న పరశురామ్ 
  • అది నచ్చే మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ  వివరణ
Sarkaru Vaari Paata movie update

'గీత గోవిందం' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న పరశురామ్, తన తాజా చిత్రంగా 'సర్కారువారి పాట' సినిమాను రూపొందించాడు. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
 
తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకుముందు మహేశ్ బాబు చేసిన ఏ సినిమాలోని పాత్రను .. ఈ సినిమాలోని పాత్రతో పోల్చలేము. ఈ సినిమాలో ఆయన పాత్ర యాటిట్యూడ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. 

ఈ సినిమా కథాకథనాలు .. ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మహేశ్ బాబుకి ఎంతో నచ్చాయి. అన్నిటికీ మించి ఆ పాత్ర యాటిట్యూడ్ ఆయనకి మరింత నచ్చింది. ఈ సినిమాను ఆయన ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం అదే. ఈ సినిమాలో మహేశ్ డాన్సులు .. ఫైట్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News