Andhra Pradesh: ఏపీలో ఐదుగురికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 3,221 కరోనా పరీక్షలు
  • గుంటూరు జిల్లాలో 2 కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 10 మంది
Five more corona cases in AP

ఏపీలో గడచిన 24 గంటల్లో 3,221 కరోనా పరీక్షలు నిర్వహించగా, 5 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లాలో 2, తూర్పు గోదావరిలో 1, కాకినాడ జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,730 మంది కరోనాతో కన్నుమూశారు.

More Telugu News