Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

  • మే 1 నుంచి తెరుచుకోనున్న శ్రీవారి మెట్టు మార్గం
  • గత నవంబర్ లో కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్టు మార్గం
  • ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్న అలిపిరి నడక మార్గం
Tirumala Srivari Mettu Margam to be opened from May 1

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మే 1వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమయింది. భక్తులు కొండపైకి ఎక్కలేనంతగా దెబ్బతింది. 

ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని మూసివేసిన టీటీడీ.. మరమ్మతులు చేపట్టింది. ఈ క్రమంలో ఐదు నెలల తర్వాత శ్రీవారి మెట్టు మార్గం మళ్లీ తెరుచుకోనుంది. ఈ సందర్భంగా టీటీడీ సభ్యుడు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా మరమ్మతులను పూర్తి చేసినట్టు వెల్లడించారు. 


ప్రస్తుతం అలిపిరి నడక మార్గం భక్తులకు అందుబాటులో ఉంది. వచ్చే నెల నుంచి శ్రీవారి మెట్టు మార్గం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో, ఇరు మార్గాల ద్వారా భక్తులు కొండపైకి చేరుకునే వెసులుబాటు లభించనుంది. శ్రీవారి మెట్టు మార్గం తెరుచుకోనుండటంపై భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్ మెంట్లలో భక్తులను ఉంచి, సర్వదర్శనానికి అనుమతిని ఇస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం, వసతి, పాలు, తాగునీరు, అన్నప్రసాదం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News