PBKS: దంచి కొట్టిన గ‌బ్బ‌ర్‌.. ముంబై ల‌క్ష్యం 199 ప‌రుగులు

  • 70 ప‌రుగులు చేసిన శిఖ‌ర్ ధావ‌న్‌
  • కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మ‌యాంక్‌
  • 5 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసిన పంజాబ్‌
pbks puts 199 target to mumbai indians

ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో భాగంగా బుధ‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దంచి కొట్టింది. పంజాబ్ స్టార్ బ్యాట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ముంబై బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్నాడు. కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ (52)తో క‌లిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ధావ‌న్ ఏకంగా 70 ప‌రుగులు చేశాడు. 49 బంతుల‌ను ఎదుర్కొన్న అత‌డు 5 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో వీర విహారం చేశాడు. మ‌రోవైపు మ‌యాంక్ కూడా గ‌బ్బ‌ర్‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా 32 బంతుల్లోనే 52 ప‌రుగులు చేశాడు. 

కెప్టెన్ ఔటైన త‌ర్వాత రెండు వికెట్లు ప‌టాప‌టా ప‌డిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత వ‌చ్చిన జితేశ్ శ‌ర్మ (30) కూడా బ్యాటును ఝుళిపించాడు. గ‌బ్బ‌ర్ అవుట్ అయ్యాక‌... జితేశ్‌కు జ‌త క‌లిసిన షారూఖ్ ఖాన్ కేవలం 5 బంతుల్లోనే 15 ప‌రుగులు చేసి స్కోరు బోర్డును ప‌రుగులెత్తించాడు. వెర‌సి పంజాబ్ కింగ్స్ త‌న 20 ఓవ‌ర్ల బ్యాటింగ్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది. ముంబై ఇండియ‌న్స్‌కు 199 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

More Telugu News