bomb: విశాఖ నుంచి సికింద్రాబాద్ వ‌చ్చే రైళ్ల‌లో బాంబులు పెట్టిన‌ట్లు అజ్ఞాత‌ వ్య‌క్తి ఫోన్.. 2 రైళ్ల‌ను ఆపి త‌నిఖీలు

  • అప్రమత్తమైన రైల్వే రక్షక దళం పోలీసులు 
  • కాజీపేటలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత‌
  • చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నూ ఆపిన పోలీసులు
bomb threat call to dial 100

విశాఖ నుంచి సికింద్రాబాద్ వ‌చ్చే రైళ్ల‌లో బాంబులు పెట్టినట్లు ఓ అజ్ఞాత‌ వ్య‌క్తి 100 నంబ‌రుకు ఫోన్ చేసి చెప్పాడు. అత‌డి ఫోన్ కాల్‌తో అప్రమత్తమైన రైల్వే రక్షక దళం పోలీసులు కాజీపేటలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ను నిలిపివేశారు. ప్ర‌స్తుతం ఆ రైలులో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. 

అంతేకాదు, చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేసి అందులోనూ తనిఖీలు చేస్తున్నారు. రైలు బోగీల్లో అనుమానాస్పద వస్తువులనూ పోలీసులు త‌ని‌ఖీలు చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? కేవ‌లం బెదిరింపు కోస‌మే అజ్ఞాత వ్య‌క్తి ఈ ఫోన్ చేశాడా? అన్న అంశాల‌పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

More Telugu News