Perni Nani: వీడ్కోలు విందు ఏర్పాటు చేసిన మంత్రి పేర్ని నాని

  • ఈరోజు రాజీనామాలు చేయనున్న ఏపీ మంత్రులు
  • మీడియా ప్రతినిధులకు వీడ్కోలు విందు ఏర్పాటు చేసిన పేర్ని నాని
  • ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుంచుకుంటానని వ్యాఖ్య
Perni Nani gives sendoff party to media

ఏపీ మంత్రులు ఈరోజు రాజీనామాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఈరోజు చివరి కేబినెట్ సమావేశం జరుగుతోంది. అంతకు ముందు మీడియాకు మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందును ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ లు కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, తనకు ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుంచుకుంటానని చెప్పారు. ఈ మూడేళ్లలో మీడియా మిత్రులందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని అన్నారు. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన జగన్ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని చెప్పారు.

More Telugu News