Telangana: వివాదంలో తెలంగాణ వైద్య శాఖ డైరెక్ట‌ర్‌.. క్షుద్ర పూజలు చేస్తూ దొరికిన వైనం

  • దేవుడు క‌రుణిస్తాడ‌ని విచిత్ర పూజ‌లు
  • ఖ‌మ్మంలో దేవ‌త‌గా ప్ర‌క‌టించుకున్న ఎంపీపీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు
  • రాజ‌కీయ ఎంట్రీ కోస‌మే శ్రీనివాస్ క్షుద్ర పూజ‌లంటూ విమ‌ర్శ‌లు
telangana dh srinivas in a new controversy

తెలంగాణ వైద్య శాఖ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ పెను వివాదంలో చిక్కుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో ఇటీవ‌ల నిత్యం మీడియా ముందుకు వ‌స్తున్న శ్రీనివాస్‌.. కొత్త‌గూడెంలో క్షుద్ర పూజ‌లు చేస్తూ దొరికిపోయారు. ప్ర‌భుత్వ అధికారిగా.. అది కూడా వైద్య శాఖ డైరెక్ట‌ర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ క్షుద్ర పూజ‌లు చేయ‌డం ఏమిటంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

గ‌త కొంత కాలంగా కొత్తగూడెం, ఖ‌మ్మం ప‌రిధిలో ప‌ర్య‌టిస్తున్న శ్రీనివాస్ దేవుడు క‌రుణిస్తాడ‌ని చెబుతూ విచిత్ర పూజ‌లు చేయిస్తున్నార‌ట‌. అంతేకాకుండా ఖ‌మ్మంలో త‌న‌ను తాను దేవ‌త‌గా ప్ర‌క‌టించుకున్న టీఆర్ఎస్ ఎంపీపీ చుట్టూ ఆయ‌న ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నార‌ట‌. దీనికి సంబంధించిన విజువ‌ల్స్ ఇప్పుడు మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి. అంతేకాకుండా రాజకీయ రంగ ప్ర‌వేశం కోస‌మే శ్రీనివాస్ క్షుద్ర పూజ‌లు చేస్తున్నారంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి,.

More Telugu News