Sensex: రెండు రోజుల లాభాలకు బ్రేక్... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

  • మార్కెట్లపై క్రూడాయిల్ ధరల ప్రభావం
  • 435 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 96 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in losses

వరుసగా రెండు రోజుల పాటు దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు పట్టపగ్గాలు లేకుండా పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 435 పాయింట్లు నష్టపోయి 60,176 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయి 17,957 కి పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.40%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.48%), ఐటీసీ (1.63%), నెస్లే ఇండియా (1.31%), టైటాన్ (1.25%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.98%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.14%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.12%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.81%), రిలయన్స్ (-1.41%).

More Telugu News