YSRTP: ష‌ర్మిల బృందంపై చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు

  • సూర్యాపేట జిల్లాలో ఘ‌ట‌న‌
  • మాట ముచ్చ‌ట‌కు హాజ‌రైన ష‌ర్మిల‌
  • ష‌ర్మిల‌కు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ నినాదాలు
  • చివ‌ర‌కు ష‌ర్మిల బృందంపైకి చెప్పుల విసిరివేత‌
trs cadre threw cheppals on ys sharmila

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌కు అవ‌మానం జ‌రిగింది. ష‌ర్మిల ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు ఆమె బృందంపై ఏకంగా చెప్పులు విసిరేశాయి. ఈ ఘ‌ట‌న‌తో సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి ప‌రిధిలోని నాగారంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 

వైఎస్సార్టీపీ రూపొందించిన‌ మాట ముచ్చ‌ట కార్య‌క్ర‌మంలో పాలుపంచుకునే నిమిత్తం ష‌ర్మిల బుధ‌వారం నాగారం వెళ్లారు. ఈ పంద‌ర్భంగా ష‌ర్మిలను చూసిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ‌, జై కేసీఆర్ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. అంత‌టితో ఆగ‌ని టీఆర్ఎస్ కార్య‌కర్త‌లు ష‌ర్మిల బృందంపై చెప్పులు విసిరేశారు. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి ష‌ర్మిల షాక్ తిన్నారు.

More Telugu News