Sharvanand: అక్కడ పడిన కష్టం ఇక్కడ మరిచిపోయేదానిని: రష్మిక

  • 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ప్రమోషన్స్ లో రష్మిక 
  • 'పుష్ప' షూటింగు అడవిలో జరిగేది 
  • అక్కడ పడిన కష్టాలు వేరు 
  • ఇక్కడి షూటింగ్ సరదాగా ఉండేదన్న రష్మిక
Adavallu Meeku Joharlu movie update

రష్మిక తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రెడీ అవుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ .. 'పుష్ప' సినిమాతో పాటు నేను చేసిన సినిమా ఇది. 'పుష్ప' సినిమా చేస్తూనే ఈ సినిమాను పూర్తిచేశాను. 'పుష్ప' సినిమా షూటింగు అడవుల్లో జరుగుతూ ఉండేది. అక్కడి వాతావరణం వేరు .. ఆ పాత్ర కోసం పడిన కష్టం వేరు. ఆ లొకేషన్ నుంచి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సెట్ కి రాగానే అక్కడ పడిన కష్టమంతా మరిచిపోయేదానిని. ఈ కథకి తగిన పాత్రలు ..  ఎక్కువమంది లేడీ ఆర్టిస్టులు కావడం వలన అంతా సంతోషంగా .. సందడిగా ఉండేది. 

ఇక ఈ కథ విన్నప్పుడు మిగతా పాత్రలు ఎవరు చేస్తారా అనుకునేదానిని. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి వంటి సీనియర్ ఆర్టిస్టులను ఎంపిక చేశారని తెలిసి చాలా సంతోషపడ్డాను. వాళ్లతో కలిసి పనిచేయడం వలన చాలా విషయాలు తెలుసుకున్నాను .. నేర్చుకున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చింది.

More Telugu News