Team India: శ్రీలంక కెప్టెన్ మెరుపు ఇన్నింగ్స్... టీమిండియా ముందు భారీ టార్గెట్

  • ధర్మశాలలో రెండో టీ20
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక
  • నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 రన్స్
  • 19 బంతుల్లో 47 పరుగులు చేసిన షనక
  • 2 ఫోర్లు, 5 సిక్సర్లతో దూకుడు
Sri Lanka set huge target for Team India

తొలి టీ20లో పేలవ ఆటతీరుతో ఓటమిపాలైన శ్రీలంక జట్టు రెండో టీ20లో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సాంక దూకుడు, కెప్టెన్ దసున్ షనక మెరుపుదాడి సాయంతో ఆ జట్టు స్కోరుబోర్డు పరుగులెత్తింది. 

టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, శ్రీలంక జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ పత్తుం నిస్సాంక 53 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేయడం విశేషం. ఓవైపు వికెట్లు పడుతున్నా నిస్సాంక దూకుడుతో ఆ జట్టు స్కోరు ఎక్కడా తగ్గలేదు. మరో ఓపెనర్ ధనుష్క గుణతిలక 4 ఫోర్లు, 2 సిక్సులతో 38 పరుగులు చేశాడు. 

అయితే, చరిత్ అసలంక (2), కమిల్ మిషార (1), దినేశ్ చాందిమల్ (9) విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో, లోయరార్డర్ లో వచ్చిన కెప్టెన్ దసున్ షనక సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షనక స్కోరులో 2 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.

More Telugu News