Ee Raathale: రెండు హృదయాలు కలిస్తే మెలొడీ పుడుతుంది... 'రాధేశ్యామ్' నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల

  • ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధేశ్యామ్
  • రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చిత్రం
  • 'ఈ రాతలే..' సాంగ్ ను పంచుకున్న చిత్రబృందం
  • జస్టిన్ ప్రభాకరన్ బాణీలకు కృష్ణకాంత్ సాహిత్యం
Ee Raathale song from Radhe Shyam released

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ గీతం విడుదలైంది. 'ఈ రాతలే..' అంటూ సాగే పాటను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. రెండు హృదయాలు కలిస్తే మెలొడీ పుడుతుంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

రాధేశ్యామ్ పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ పాటను హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేశారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, తెలుగులో ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం సమకూర్చారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. రాధేశ్యామ్ చిత్రం మార్చి 11న ప్రేక్షుకుల ముందుకు రానుంది.

More Telugu News