Sharwanand: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

  • శర్వానంద్ తాజా చిత్రంగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
  • కథానాయికగా రష్మిక
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • మార్చి 4వ తేదీన విడుదల
Adavallu Meeku Joharlu movie update

శర్వానంద్ - రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే రోజున 'భీమ్లా నాయక్' వస్తుండటంతో, ఈ సినిమాను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ కొత్త రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి కీలకమైన పాత్రలను పోషించారు. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

'మహానుభావుడు' తరువాత శర్వానంద్ కి హిట్ లేదు. 'రణరంగం' .. 'జాను' .. 'మహాసముద్రం' వంటి ప్రయోగాలతో ఆయన డీలాపడ్డాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి..

More Telugu News