Chiranjeevi: బాలీవుడ్ కి భారీస్థాయిలో వెళుతున్న 'ఆచార్య'?

  • కొరటాల రూపొందించిన 'ఆచార్య'
  • నక్సలైట్ల పాత్రల్లో చిరూ .. చరణ్
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • ఏప్రిల్ 29వ తేదీన విడుదల    
Acharya movie update

చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన 'ఆచార్య' విడుదలకి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ముందుగా ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు హిందీ వెర్షన్ లోను భారీస్థాయిలో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

బాలీవుడ్లో భారీస్థాయిలో ఈ సినిమాను వదలాలనే దిశగానే సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అవినీతి పరులైన భూస్వాముల పెత్తందారీతననానికి వ్యతిరేకంగా పోరాడే నక్సలైట్ల పాత్రల్లో చిరంజీవి - చరణ్ కనిపించనున్నారు. చిరూ సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది.

నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఆయన నుంచి వదిలిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోనూ సూద్ .. సంగీత .. పోసాని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రెజీనా ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది..

More Telugu News