Rajendra Prasad: 'సేనాపతి' నుంచి ఆసక్తికరమైన ట్రైలర్!

  • 'సేనాపతి'గా రాజేంద్ర ప్రసాద్
  • డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర
  • నిర్మాతగా చిరూ కూతురు
  • ఈ నెల 31 నుంచి 'ఆహా'లో  
Senapathi trailer released

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఓటీటీ వెంచర్ గా 'సేనాపతి' సినిమాను నిర్మించింది. ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన నుంచి 'సావిత్రి' .. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాలు వచ్చాయి. ఈ సినిమా 'ఆహా'లో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. "జీవితంలో మంచి - చెడు రెండూ చూడాలి, ఆ రెండింటి మధ్యే ఎదగాలి" అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలైంది. పోలీస్ లకు .. రౌడీలకు మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఒక సాధారణమైన వ్యక్తిలా కనిపించే కృష్ణమూర్తి ప్రమాదకరమైన పనులను చక్కబెడుతుంటాడు.

కృష్ణమూర్తి .. ఆ తరువాత సేనాపతిగా మారతాడు అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. అందుకు కారణమేమిటి? రహస్యంగా ఆయన సాగిస్తున్న అన్వేషణ దేని కోసం? అనే అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ప్రశ్నలను సమాధానం దొరకాలంటే 'సేనాపతి'ని చూడటం ఒక్కటే మార్గం. 

More Telugu News