Allu Arjun: విలన్ కావడానికి 300 సినిమాలు చేయాల్సి వచ్చింది: సునీల్

  • 'పుష్ప'గా అల్లు అర్జున్
  • నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 17న సినిమా విడుదల
  • 'మంగళం శ్రీను'గా సునీల్
Pushpa movie update

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ సినిమాలో 'మంగళం శ్రీను'గా నటించిన సునీల్ తన పాత్ర గురించి మాట్లాడాడు.

"సాధారణంగా ఎవరైనా విలన్ కావాలనుకుంటే ఆ దిశగా గట్టిగా ప్రయత్నం చేసి, ఓ ఆరేడేళ్లలో విలన్ అయిపోతారు. కానీ నేను విలన్ కావడానికి ముందు, కమెడియన్ గా 300 సినిమాలు చేయవలసి వచ్చింది .. హీరోగా ఓ 10 సినిమాలు చేయవలసి వచ్చింది. ఈ సారి మాత్రం మిమ్మల్ని కాస్త భయపెడతాను .. భరించండి అంతే.

ఇంతకుముందు నేను చేసిన పాత్రలను గుర్తుపెట్టుకుని ఈ సినిమాలో నన్ను చూడొద్దు. ఈ సినిమా వరకూ నన్ను కొత్తగా చూడండి. ఇతర భాషల్లో నేను కనిపించడమే ఇది ఫస్టు టైమ్ కనుక .. విలన్నే అనుకుంటారు . అక్కడ నాకు ఎలాంటి టెన్షన్ లేదు .. నా టెన్షన్ అంతా కూడా తెలుగు వెర్షన్ కి సంబంధించినదే" అంటూ చెప్పుకొచ్చాడు సునీల్.

More Telugu News