jawan: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఐదుగురు జ‌వాన్ల వీర‌మ‌ర‌ణం

  • జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఘ‌ట‌న‌
  • ఉగ్రవాదుల కోసం సెర్చ్ చేస్తుండ‌గా కాల్పులు
  • ఉగ్ర‌వాదులతో కొన‌సాగుతోన్న‌ జ‌వాన్ల పోరు
5 jawans martyred in kashmir

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ఐదుగురు భార‌త జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నార‌ని తెలుసుకున్న భార‌త జ‌వాన్లు సెర్చ్ ఆప‌రేష‌న్ జ‌రుపుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతి చెందిన జ‌వాన్ల‌లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి కూడా ఉన్నారు.  ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌ర‌ప‌డంతో భార‌త జ‌వాన్లు దీటుగా స్పందిస్తున్నారు. ప్ర‌స్తుతం కాల్పులు కొన‌సాగుతున్నాయి. ఉగ్ర‌వాదుల‌ను జ‌వాన్లు మ‌ట్టుబెట్టే అవ‌కాశం ఉంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News