Manchu Vishnu: వేర్వేరుగా మీడియా ముందుకు రానున్న ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు.. ఏం చెప్ప‌బోతున్నార‌నే ఉత్కంఠ‌!

  • మా ఎన్నిక‌ల్లో గెలిచిన విష్ణు
  •  ఓటమికి గ‌ల‌ కారణాలు చెప్ప‌నున్న ప్ర‌కాశ్ రాజ్
  • ప్ర‌కాశ్ రాజ్ మాట్లాడిన త‌ర్వాత మంచు విష్ణు మీడియా స‌మావేశం
vishnu to conduct press meet

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌ల్లో హీరో మంచు విష్ణు గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు వేర్వేరుగా మీడియాతో మాట్లాడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో వారు ఏం చెబుతున్నార‌న్న అంశంపై ఉత్కంఠ నెల‌కొంది. తన ఓటమికి గ‌ల‌ కారణాలను ప్రకాశ్ రాజ్ చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. నిన్న కూడా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ 'మీ తెలుగువాడినే గెలిపించారు' అని అన్నారు.  

మరోవైపు, ప్ర‌కాశ్ రాజ్ మీడియాతో మాట్లాడిన త‌ర్వాత మంచు విష్ణు కూడా మాట్లాడ‌నున్నాడు. ఈ మేర‌కు ఈ రోజు ఉద‌యం ట్వీట్ చేశాడు. మ‌రిన్ని పోస్టులకు సంబంధించిన కౌంటింగ్‌ ఉందని చెప్పాడు. ఆ త‌ర్వాత ఈ ఎన్నికల గురించి మాట్లాడతానని తెలిపాడు. సినిమా కుటుంబం త‌నపై చూపిన ప్రేమ, మద్దతుకు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. ఈసీ మెంబర్స్‌, జాయింట్‌ సెక్రటరీ, ఒక ఉపాధ్యక్షుడి పోస్ట్‌కు సంబంధించిన కౌంటింగ్‌ ఈరోజు ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంద‌ని తెలిపాడు.

More Telugu News