Train Accident: త్రుటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్న మ‌హిళ‌.. వీడియో వైర‌ల్

  • ముంబైలో ఘ‌ట‌న‌
  • క‌దులుతోన్న రైలు ఎక్క‌బోయిన మ‌హిళ‌
  • జారి రైలు కింద ప‌డ‌బోయిన వైనం
  • ర‌క్షించిన తోటి ప్ర‌యాణికుడు
 Passengers saved a woman from falling under a moving train at Vasai Road Railway Station

ఓ మ‌హిళ రైలు కింద‌ప‌డ‌బోయి త్రుటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకుంది. ఇందుకు సంబంధించిన మ‌హిళ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో  వైర‌ల్ అవుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే, మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని వాస‌యి రోడ్డు రైల్వే జంక్ష‌న్ వ‌ద్ద రైలు ఎక్కేందుకు ఓ మ‌హిళ వ‌చ్చింది.

అయితే, రైలు ఆగి ఉన్న స‌మ‌యంలో ఆమె అందుకోలేక‌పోయింది. రైలు క‌దులుతుండ‌గా ప‌రుగున అక్క‌డ‌కు వ‌చ్చి రైలు ఎక్క‌డానికి ప్ర‌య‌త్నించింది. ఇంత‌లో జారి రైలు కింద ప‌డ‌బోయింది. వెంట‌నే అక్క‌డ ఉన్న ఓ వ్య‌క్తి ఆమెను ప్లాట్‌ఫాం పైకి లాగాడు.

మరికొంత మంది కూడా అక్క‌డ‌కు వ‌చ్చి ఆమెను ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ముంబై రైల్వే స్టేష‌న్‌లో త‌రుచూ ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

More Telugu News