USA: అమెరికాలో మ‌రోసారి కాల్పులు.. న‌లుగురి మృతి

  • దక్షిణ కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ సిటీలో కాల్పులు
  • మృతుల్లో ఓ చిన్నారి
  • అనుమానితుడిపై పోలీసుల కాల్పులు  
shooting in usa

అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ సిటీలో ఓ వ్యక్తి కాల్పులు జ‌ర‌ప‌డంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ చిన్నారి కూడా ఉంది. లికోయిన్‌ అవెన్యూ కార్యాల‌య‌ భవనం రెండవ అంతస్తులో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయ‌ని పోలీసులు చెప్పారు.

ఈ కాల్పుల గురించి స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసు అధికారులు ఓ అనుమానితుడిపై కాల్పులు జ‌ర‌ప‌గా అత‌డికి స్వల్ప గాయాల‌య్యాయి. అనంత‌రం అతడిని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు అన్నారు. అమెరికాలో ప‌దే ప‌దే కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

More Telugu News