shyamala: మీ వెనక నడిచే లక్షల అడుగులలో నేను కూడా..: సీఎం జ‌గ‌న్‌కు మద్దతుగా యాంక‌ర్ శ్యామ‌ల ట్వీట్

  • విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ సంరక్షణ కోసం పోరాడుతున్నారు
  • కార్మికులతో సమావేశం, బందుకు మద్దతు ఇచ్చారు
  • అఖిలపక్షంతో ప్రధానిని కలవడానికి స‌మ‌యం కోరారు
  • మీ నాయకత్వంలో జరిగే ప్రయత్నం సఫలం కావాలి
shyamala tweets about jagan

టీవీలు, సినిమా ఫంక్ష‌న్ల‌లోనే విన‌ప‌డే యాంక‌ర్ శ్యామ‌ల పేరు ఇప్పుడు రాజ‌కీయాల్లోనూ విన‌ప‌డుతోంది. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేసుకుంటున్నార‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో ఇటీవ‌ల ఆమెతో శ్యామల స‌మావేశం కావ‌డం గ‌మ‌నార్హం. ష‌ర్మిల పార్టీ పెడితే ఆమె ఆ పార్టీలో చేరు‌తుంద‌ని ఊహాగానాలు వ‌స్తున్నాయి. అయితే, ఉన్న‌ట్టుండి ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆకాశానికెత్తేస్తూ శ్యామ‌ల ప‌లు వ్యాఖ్య‌లు చేసింది.

'ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు విశాఖ ఉక్కు సంరక్షణ కోసం కార్మికులతో సమావేశం, బందుకు మద్దతు ఇవ్వడం అఖిలపక్షంతో ప్రధానిని కలవడానికి సమయం కోరడం ద్వారా ఏపీ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలిపినట్లయినది. మీ నాయకత్వంలో జరిగే ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తూ మీ వెనక నడిచే లక్షల అడుగులలో  నేను కూడా' అంటూ యాంక‌ర్ శ్యామ‌ల‌ ట్వీట్ చేసింది.

More Telugu News