Vijay Sai Reddy: మునిసిపల్ ఎన్నిక‌లకు టీడీపీ మేనిఫెస్టోపై విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు

  • వైసీపీ నవరత్నాలను కాపీకొట్టి... టీడీపీ  మేనిఫెస్టో
  • "పల్లెలు గెలిచాయి - ఇప్పుడిక మనవంతు" అంట
  • అవును టీడీపీని చిత్తు చేయడం ఇప్పుడు పట్టణాలు, నగరాల వంతే
  • అదే జరగబోతోంది కూడా పప్పు నాయుడూ
vijaya sai slams chandrababu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాలక ఎన్నిక‌ల నేప‌థ్యంలో నిన్న‌ టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే‌. 10 అంశాల‌ను పొందుపర్చుస్తూ 'ప‌ల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మ‌నవంతు' పేరిట ఎన్నిక‌ల‌ మేనిఫెస్టోను ఆ పార్టీ విడుద‌ల చేసింది. ఆ పార్టీ మేనిఫెస్టోపై వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మ న‌వ‌ర‌త్నాల‌ను కాపీ కొట్టారని చెప్పుకొచ్చారు.

వైసీపీ నవరత్నాలను కాపీకొట్టి... టీడీపీ పప్పు  మునిసిపల్ మేనిఫెస్టో  విడుదల చేశాడు. దానిపేరు "పల్లెలు గెలిచాయి - ఇప్పుడిక మనవంతు" అంట. అవును టీడీపీని చిత్తు చేయడం ఇప్పుడు పట్టణాలు, నగరాల వంతే. అదే జరగబోతోంది కూడా పప్పు నాయుడూ! అంటూ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

More Telugu News