Chennai Super Kings: రాణించిన రాయుడు,డుప్లెసిస్, జడేజా... చెన్నై సూపర్ కింగ్స్ 179/4

  • షార్జాలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • డుప్లెసిస్ అర్ధసెంచరీ
  • 13 బంతుల్లో 33 పరుగులు చేసిన జడేజా
Chennai Super Kings posted reasonable score against Delhi Capitals

ఐపీఎల్ లో భాగంగా షార్జా క్రికెట్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ 6 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 58 పరుగులు చేయగా, వెటరన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ 6 ఫోర్లతో 36 పరుగులు సాధించాడు.

తెలుగుతేజం అంబటి రాయుడు వేగంగా ఆడి 45 పరుగులు నమోదు చేశాడు. 25 బంతులు ఎదుర్కొన్న రాయుడు 1 ఫోర్, 4 సిక్సర్లు బాదాడు. ఇక చివర్లో లెఫ్ట్ హ్యాండర్ రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించాడు. కేవలం 13 బంతులు ఆడిన జడేజా 4 సిక్సర్లతో 33 పరుగులు సాధించాడు.

అంతకుముందు ఓపెనర్ శామ్ కరన్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ ధోనీ 3 పరుగులకే వెనుదిరిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జె 2 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, కగిసో రబాడా చెరో వికెట్ దక్కించుకున్నారు.

More Telugu News