Kadapa District: కడపలో కలకలం.. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్న ఇరు వర్గాలు.. ఒకరి మృతి

  • మున్సిపల్ మైదానంలో ఘటన
  • కూరగాయల వ్యాపారుల మధ్య గొడవ
  • అదుపు చేసిన పోలీసులు
ruckus in kadapa

కడప మున్సిపల్ మైదానంలో కలకలం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య గొడవ చెలరేగి ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణకు దిగిన వారంతా కూరగాయల దుకాణదారులేనని తెలిసింది. ఓ విషయంలో ఏర్పడిన గొడవ కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

మైదానంలో తీవ్ర వాగ్వివాదానికి దిగిన కూరగాయల దుకాణదారులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం కర్రలతో దాడి చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కొందరిని అరెస్టు చేసినట్లు తెలిసింది.

More Telugu News