Pavan kalyan: అదంతా పుకారేనన్న హరీశ్ శంకర్!

  • పవన్ కల్యాణ్ తో హరీశ్ మూవీ
  • మానస రాధాకృష్ణన్ హీరోయిన్ అంటూ టాక్
  • పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన హరీశ్ శంకర్  
Harish Shankar Movie

చాలాకాలం క్రితం పవన్ కథానాయకుడిగా దర్శకుడు హరీశ్ శంకర్ 'గబ్బర్ సింగ్' సినిమాను తెరకెక్కించాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. మళ్లీ ఇంతకాలానికి పవన్ తో మరో సినిమా చేయనున్నామని ఇటీవల హరీశ్ శంకర్ స్పష్టం చేశాడు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా మానస రాధాకృష్ణన్ అనే మలయాళ ముద్దుగుమ్మను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే మలయాళ సినిమాలతో బిజీ అవుతున్న ఈ సుందరి, పవన్ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం కానుందని చెప్పుకున్నారు.

మలయాళ భామలు తెలుగు తెరపై తమ జోరు చూపుతున్న కారణంగా అంతా ఈ వార్త నిజమేనని అనుకున్నారు. అయితే, అందులో ఎంత మాత్రం నిజం లేదని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ఈ వార్త కేవలం పుకారు మాత్రమేనని చెప్పారు. తన సినిమాలకి సంబంధించిన వివరాలను తానే స్వయంగా తెలియజేస్తానని అన్నారు. ఈ పుకారు ఎక్కడ పురుడు పోసుకుందో తెలియదుగానీ, హరీశ్ శంకర్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక ఇప్పుడు పవన్ సరసన కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కుతుందోననేది ఆసక్తికరంగా మారింది.

More Telugu News