Kalyan Ram: కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం?

  • సొంత సినిమాతో బిజీగా కల్యాణ్ రామ్ 
  • మరో రెండు సినిమాలు సెట్స్ పైకి 
  • ట్రిపుల్ యాక్షన్ కథతో కల్యాణ్ రామ్ ను కలిసిన నిర్మాతలు
Mytri Movie Makers

కల్యాణ్ రామ్ ఒక వైపున ఎన్టీఆర్ తదుపరి సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటునే, మరో వైపున తను హీరోగా వరుస సినిమాలను అంగీకరిస్తూ వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మల్లిడి వేణు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో కూడిన ఈ సినిమాను తన బ్యానర్లోనే నిర్మిస్తున్నాడు.

ఇక వీఐ ఆనంద్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు నిర్మించే సినిమా ఒకటి, గుహన్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించే సినిమా ఒకటి లైన్లో వున్నాయి. ఈ నేపథ్యంలోనే మైత్రీ మూవీ మేకర్లు కల్యాణ్ రామ్ దగ్గరికి ఒక కథతో వచ్చారట. ఇది త్రిపాత్రాభినయానికి సంబంధించిన కథ. హీరో ట్రిపుల్ యాక్షన్ చేయవలసి ఉంటుంది. యాక్షన్ పాళ్లు కూడా ఎక్కువగానే వున్నాయని సమాచారం. ఈ కథ విన్న కల్యాణ్ రామ్ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదట. వరుస సినిమాలతో బిజీగా వున్న ఆయన ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా? అనేది చూడాలి.

More Telugu News