Mangalagiri MLA: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ

  • పది లక్షల రూపాయలు చోరీ
  • సంక్షేమ కార్యక్రమాల కోసం దాచి ఉంచినట్టు వెల్లడి
  • కార్యాలయంలో పనిచేసే వారిపైనే అనుమానం

ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. సంక్షేమ కార్యక్రమాల కోసం దాచి ఉంచిన 10 లక్షల రూపాయల మొత్తం చోరీకి గురైంది. ఈ మేరకు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కార్యాలయంలో పనిచేసే వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వైసీపీ నేత జూపూడి జాన్సన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరేశ్ కుమార్ తెలిపారు.

More Telugu News