bandaru dattatreya: 5న హిచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాను: బండారు దత్తాత్రేయ

  • ముందురోజు ఆ రాష్ట్రానికు వెళ్తానని వెల్లడి
  • ఖైరతాబాద్‌ గణేశ్ ని దర్శించుకున్న దత్తాత్రేయ 
  • ఘనంగా సత్కరించిన ఉత్సవ కమిటీ

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఈనెల 5న తాను బాధ్యతలు స్వీకరిస్తానని కేంద్ర మాజీ మంత్రి, గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈరోజు ఉదయం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, సత్కరించింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ 4వ తేదీన హిమాచల్‌ప్రదేశ్ వెళ్తానని, మరునాడు బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు.

More Telugu News