Odisha: ఒడిశాకు ఆపన్నహస్తం.. రూ.10 కోట్ల సాయాన్ని ప్రకటించిన కేరళ!

  • ప్రకటన చేసిన సీఎం కార్యాలయం
  • ఒడిశా సీఎం సహాయనిధికి డిపాజిట్ చేస్తామని వెల్లడి
  • ఇప్పటికే రూ.1,381 కోట్ల సాయం ప్రకటించిన కేంద్రం

ఒడిశా రాష్ట్రాన్ని ఇటీవల ఫొని తుపాను గజగజలాడించిన సంగతి తెలిసిందే. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలపై కొంత మేర ప్రభావం చూపినప్పటికీ ఫణి విధ్వంసం ప్రధానంగా ఒడిశాపైనే సాగింది. ఈ నేపథ్యంలో ఒడిశాకు అండగా నిలిచేందుకు కేరళ రాష్ట్రం ముందుకు వచ్చింది.

ఒడిశాకు రూ.10 కోట్ల మేర సహాయాన్ని అందిస్తామని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిస్తామని వెల్లడించింది. ఒడిశాకు ప్రధాని మోదీ ఇప్పటికే రెండు విడతల్లో రూ.1,381 కోట్ల సాయాన్ని ప్రకటించారు.

More Telugu News