Guntur District: తాడేపల్లి పీఎస్ వద్ద వైసీపీ నేత ఆర్కే ధర్నా

  • వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం సబబు కాదు
  • టీడీపీ కార్యకర్తలపైనా కేసులు నమోదు చేయాలి
  • చంద్రబాబు, లోకేశ్ ఒత్తిడితో కేసుల నమోదు తగదు

వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని నిరసిస్తూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. టీడీపీ కార్యకర్తలపై ఇచ్చిన ఫిర్యాదు పైనా కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు తమ కార్యకర్తలపై దాడులు చేస్తే, తిరిగి తమ కార్యకర్తలపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ ల ఒత్తిడి కారణంగానే తమ కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News