sumanth aswin: భయపెడుతోన్న 'ప్రేమకథాచిత్రమ్ 2' ట్రైలర్

  • తెరపైకి రానున్న మరో హారర్ కామెడీ
  • ప్రధాన పాత్రధారిగా నందిత శ్వేత
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  

గతంలో సుధీర్ బాబు .. నందిత రాజ్ జంటగా నటించిన 'ప్రేమకథా చిత్రమ్' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'ప్రేమకథా చిత్రమ్ 2' రూపొందింది. సుమంత్ అశ్విన్ .. నందిత శ్వేత .. సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ప్రధాన పాత్రల కాంబినేషన్లో .. హారర్ కామెడీ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. 'సంథింగ్ ఈజ్ రాంగ్ .. అదేంటో తెలుసుకోవాలి' అనే హీరో డైలాగ్ .. 'ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా?' అనే నందిత శ్వేత డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 'ప్రేమకథా చిత్రమ్' మాదిరిగా .. ఈ సీక్వెల్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి

More Telugu News