nagachaitanya: 'శైలజా రెడ్డి అల్లుడు' గురించి అనూ ఇమ్మాన్యుయేల్

  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • చైతూ సరసన నాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • హైలైట్ గా నిలవనున్న రమ్యకృష్ణ పాత్ర

ఇటీవల కాలంలో తెలుగు తెరపై గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపిస్తుంది. ఒక చిన్నపాటి నవ్వుతోనే ఈ సుందరి కుర్రకారు మతులు పోగొడుతోంది. అలాంటి అనూ ఇమ్మాన్యుయేల్ తన తాజా చిత్రంగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తోంది. మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

ఈ సినిమాలో అనూ పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. అది గ్రహించిన అనూ ఈ సినిమాలో తన పాత్ర చాలా ఈగోయిస్టిక్ గా ఉంటుందని చెప్పింది. కాస్త పొగరుగా కనిపించే ఈ పాత్రలో తాను కొత్తగా కనిపిస్తానని అంది. ఈ తరహా పాత్రను చేయడం ఇదేమొదటిసారి అనీ .. తనకి మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఇక తనకి తల్లిగా రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.    

More Telugu News