Nirav Modi: పీఎన్బీని ముంచిన నీరవ్‌ మోదీ ఇంటి నుంచి పది వేల విదేశీ చేతి గడియారాలు స్వాధీనం!

  • ఈ రోజు జప్తు చేసిన 21 స్థిరాస్తుల మొత్తం విలువ రూ.523 కోట్లు
  • అత్యంత ఖరీదైన 10 వేల రకాల విదేశీ చేతి గడియారాలు కూడా సీజ్
  • అహ్మద్‌నగర్‌లో 135 ఎకరాల స్థలం

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు నీరవ్ మోదీకి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సోదాల్లో నీరవ్ గ్రూప్ కు చెందిన 21 ఆస్తులను జప్తు చేశారు.  అత్యంత ఖరీదైన 10 వేల రకాల విదేశీ చేతి గడియారాలు కూడా సీజ్ చేశామని అధికారులు అన్నారు.

జప్తు చేసిన మరిన్ని ఆస్తుల వివరాలు..

  • ఇప్పటి వరకు జప్తు చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.6,393 కోట్లు
  • ఈ రోజు జప్తు చేసిన 21 స్థిరాస్తుల మొత్తం విలువ రూ.523 కోట్లు
  • ముంబయిలోని సముద్రమహల్‌ అపార్టెంట్‌లోని రూ.15.45 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌
  • రూ.81.16కోట్ల విలువ చేసే పెంట్‌హౌస్‌
  • 6 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ, పది కార్యాలయాలు సీజ్‌
  • పూణెలో రెండు ఫ్లాట్లు, ఓ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌, అలీబగ్‌లోని ఫామ్‌ హౌస్‌
  • అహ్మద్‌నగర్‌లో 135 ఎకరాల స్థలం

More Telugu News