chiru: మెగా ఫ్యాన్స్ మెచ్చేలా 'సైరా'లో పవర్ ఫుల్ డైలాగ్స్

  • చిరూ కథానాయకుడిగా 'సైరా నరసింహా రెడ్డి'
  • పదునైన సంభాషణలు రాసిన సాయిమాధవ్ బుర్రా
  • డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తాయని టాక్

చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 6వ తేదీ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో వున్నారు. చారిత్రక నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో, చిరూ స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించనున్నారు. గంభీరమైన వేషధారణతో .. ఆవేశంతో కూడిన ఆశయంతో ఈ పాత్ర స్వభావం ఉండనుంది.

అందువలన చిరూ పాత్ర కోసం రచయిత సాయిమాధవ్ బుర్రాతో పవర్ఫుల్ డైలాగ్స్ రాయించారట. ప్రాణాలను సైతం లెక్కచేయని ఓ పోరాటయోధుడు ఎలా మాట్లాడతాడో అలా చాలా పదునైన సంభాషణలను సాయిమాధవ్ బుర్రా రాశాడట. గతంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' కోసం ఆయన రాసిన మాటలు ఎంతటి ఉత్తేజాన్ని కలిగించాయో తెలిసిందే. అంతకి మించిన సంభాషణలను ఆయన అందించాడనీ .. ఈ డైలాగ్స్ మెగా ఫ్యాన్స్ లో హుషారెత్తిస్తాయని చెప్పుకుంటున్నారు.
 

More Telugu News