Sachin Tendulkar: సచిన్ ఘోర తప్పిదం.. ఆటాడుకున్న నెటిజన్లు!

  • మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సొంతం  చేసుకున్నాక సచిన్ ట్వీట్
  • అవాక్కయిన నెటిజన్లు.. వైరల్ అయిన ట్వీట్
  • వ్యంగ్యోక్తులతో విరుచుకుపడుతున్న నెటిజన్లు

కాన్పూర్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన చివరి వన్డే ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుందని, నువ్వా-నేనా అన్నట్టు సాగే ఈ మ్యాచ్‌లో భారత్‌దే విజయమని మ్యాచ్‌ ముగిసిన తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్  చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సచిన్ అంత సరిగ్గా ఎలా ఊహించాడంటూ నెటిజన్లు వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. సర్ మీరు చూస్తున్నది రిపీట్ టెలికాస్టా?’’ అని మరొకరు ప్రశ్నించారు.  ఒకరైతే ‘‘సచిన్ నువ్వు దేవుడివి. వచ్చే ఏడాది జరిగే సిరీస్‌ను కూడా నీవు చూడగలవు’’ అని వ్యంగ్యోక్తి విసిరారు.

కాన్పూర్‌ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 337 పరుగులు చేసి ఆతిథ్య జట్టు ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బరిలోకి దిగిన కివీస్ తొలి నుంచే దూకుడు మొదలుపెట్టింది. విజయం దిశగా దూసుకుపోయింది. కివీస్ గెలుపు తథ్యమని అందరూ భావించారు. అయితే చివరలో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. చివరికి భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన వన్డేలో గెలిచిన భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరగ్గా సచిన్ సోమవారం ఈ ట్వీట్ చేయడంతో వైరల్ అయింది.

More Telugu News