nayanatara: నయనతార పారితోషికాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు!

తమిళంలో కొన్నేళ్లుగా నయనతార ఏ మాత్రం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వస్తోంది. డేట్స్ సర్దుబాటు అయ్యే అవకాశం వుంటే చాలు ఆమె తెలుగులో గానీ .. మలయాళంలో గాని చేస్తుంది. అలాంటి నయనతార ఆ మధ్య నాగార్జునతో చేసిన 'గ్రీకువీరుడు' భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మధ్య వెంకటేశ్ తో చేసిన 'బాబు బంగారం' కూడా అభిమానులకు నిరాశనే మిగిల్చింది. దాంతో ఇక ఇక్కడ నయనతార పనైపోయినట్టేనని అంతా అనుకున్నారు.

 ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ 102వ సినిమా కోసం నయనతారను తీసుకున్నారు. ఇందుకోసం 3 కోట్లకి పైగా పారితోషికం ఆమెకి అందనున్నట్టు సమాచారం. ఇక పెద్దగా గ్యాప్ లేకుండానే చిరంజీవి 151వ సినిమాలోను కథానాయికగా ఆమెకి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఎక్కువ డేట్స్ కేటాయించవలసి రావడం వలన, పారితోషికంగా ఆమె 4 కోట్లు అందుకోనున్నట్టు చెబుతున్నారు. ఇక్కడ నయనతార పనైపోయిందనుకున్న వాళ్లు .. ఇప్పుడు నోరెళ్ల బెడుతున్నారు.          

More Telugu News