: ఈ ఏడాది ఇద్దరు తెలుగు క్రీడాకారులకు అర్జున అవార్డులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఏడాది అందించే అవార్డుల ప్ర‌క‌ట‌న‌ను ఈ రోజు చేశారు. 2017 సంవత్సరానికి గానూ పారా అథ్లెట్ దేవేంద్రకు, హాకీ క్రీడాకారుడు సర్దార్ సింగ్ కు రాజీవ్ ఖేల్‌ర‌త్న అవార్డులు అందించ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఈ ఏడాది ఏడుగురికి ద్రోణాచార్య అవార్డులు ద‌క్కాయి. 17 మందికి అర్జున అవార్డులు ద‌క్క‌గా, అందులో తెలుగు క్రీడాకారులు వి.జ్యోతి సురేఖ (విలు విద్య‌), సాకేత్ మైనేని (టెన్నిస్‌) ఉన్నారు. ముగ్గురికి ధ్యాన్ చంద్ అవార్డులు అందిస్తున్న‌ట్లు కేంద్ర స‌ర్కారు తెలిపింది.  

More Telugu News