: టీడీపీ విష ప్రచారం చేస్తోంది: శిల్పా చక్రపాణిరెడ్డి

బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందంటూ ఎల్లో మీడియాతో టీడీపీ విష ప్రచారం చేస్తోందని శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. నంద్యాలలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాకినాడలో బీజేపీ జెండాలతో తిరుగుతున్న చంద్రబాబు, నంద్యాలలో మాత్రం ఆ పార్టీ జెండాలు కనపడకుండా జాగ్రత్తపడుతున్నారని, మైనార్టీలను మోసం చేసే కుట్రకు చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. కాగా, నంద్యాల ఉపఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఉపఎన్నికల బరిలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా, టీడీపీ, వైసీపీ నేతల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.

More Telugu News