kajal: పారితోషికం పెంచే ఆలోచనలో కాజల్!

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా కాజల్ తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తమిళంలో అజిత్ సరసన 'వివేగం' (తెలుగులో వివేకం) సినిమా చేసింది. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విజయ్ జోడీగా చేసిన 'మెర్సెల్' అక్టోబర్లో విడుదల కానుంది. స్టార్ హీరోల సినిమాలు కనుక .. ఈ రెండింటిపై భారీ అంచనాలు వున్నాయి.

ఈ సినిమాలు హిట్ అయితే తన పారితోషికాన్ని పెంచాలనే ఆలోచనలో కాజల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగులో ఇటీవల ఆమె చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె కల్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఇక్కడ కూడా రెమ్యునరేషన్ పెంచడానికి రెడీగా ఉందట. మొత్తానికి కాజల్ పక్కా ప్లానింగ్ తోనే ఉందన్నమాట.  

More Telugu News