: యువరాజ్ సింగ్ కు ఇంకా తలుపులు మూసుకుపోలేదు: ఎమ్మెస్కే ప్రసాద్

టీమిండియాలో స్థానం సంపాదించేందుకు యువరాజ్ సింగ్ కు ఇంకా దారులు మూసుకుపోలేదని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. శ్రీలంకలో టెస్టు సిరీస్ గెలుచుకున్న నేపథ్యంలో ఎమ్మెస్కే మాట్లాడుతూ, జట్టులో పేరు ప్రకటించలేదంటే దానర్థం ఇంకెప్పుడూ జట్టులోకి ఎంపిక చేయమని అర్థం కాదని, ప్రస్తుతం యువీకి విశ్రాంతి కల్పించామని చెప్పారు.

క్రికెట్ ఆడే హక్కు అందరికీ ఉందని, అలాగే ఎవరికీ తలుపులు మూసుకుపోలేదని, క్రికెట్ ఆడడం అభిరుచి అని, అందరికీ అది ఉంటుందని ఆయన చెప్పారు. సెలెక్షన్ విషయానికి వస్తే తాము అత్యుత్తమ జట్టును ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుందని, అలాగే కాంబినేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. సెలెక్షన్ కమిటీ అందరి గురించి చర్చిస్తుందని, ఏ ఒక్కరి గురించో ఆలోచించదని ఎమ్మెస్కే చెప్పారు. 

More Telugu News