: రూపు మార్చుకోనున్న కాపు ఉద్యమం.. మరాఠాల బాటలో కాపులు?

రిజర్వేషన్ల కోసం ఇప్పటి వరకు తమదైన శైలిలో ఉద్యమించిన కాపులు... ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్రలోని మరాఠాలు తమ హక్కుల సాధన కోసం ముంబైలో శాంతియుతంగా మిలియన్ మార్చ్ నిర్వహించిన నేపథ్యంలో, తాము కూడా అదే పద్ధతిలో ముందుకు సాగాలని కొందరు కాపు నేతలు భావిస్తున్నారు.

మరాఠాల తరహాలోనే తాము కూడా అమరావతిలో శాంతియుతంగా మార్చ్ నిర్వహించి, బహిరంగసభను నిర్వహిస్తే బాగుంటుందని యోచిస్తున్నారు. ఈ దిశగా కాపు నేత ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరపాలని భావిస్తున్నారు. మరోవైపు, ఛలో అమరావతి పాదయాత్ర చేయడానికి గత 15 రోజులుగా ముద్రగడ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతి రోజు పాదయాత్ర కోసం ఆయన ఇంటి నుంచి బయటకు రావడం... పోలీసులు అడ్డుకోవడం జరుగుతోంది. 

More Telugu News