: ముద్రగడను మరోసారి అడ్డుకున్న పోలీసులు!

కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఈ ఉదయం పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. పాదయాత్ర కోసం తన ఇంటి నుంచి బయల్దేరిన ఆయనను ఇంటి గేటు వద్దే పోలీసులు ఆపేశారు. కాసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగిన ముద్రగడ... చివరకు తిరిగి తన ఇంట్లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి రోజు పాదయాత్రకు ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పారు. మరోవైపు, పాదయాత్ర నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముద్రగడ స్వగ్రామంలోనే కాకుండా జిల్లాలోని పలుచోట్ల పోలీసులు మోహరించారు.

More Telugu News