nagachaitanya: 'ఫిదా' వలన చైతూ చేజారిపోయిన కథ!

కృష్ణవంశీతో పాటు మరికొందరు దర్శకుల దగ్గర అసోసియేట్ గా పనిచేసిన సౌజన్య .. దర్శకురాలిగా పరిచయం కావడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె ఒక కథను సిద్ధం చేసుకున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ వారికి ఆ కథ నచ్చడంతో వాళ్లు నాగచైతన్యను లైన్లో పెట్టారు. ఈ కథ విన్న చైతూ, చాలా బాగుందనీ .. చేసేద్దామని చెప్పాడు.

 ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు 'ఫిదా' వచ్చింది. సౌజన్య .. చైతూతో చేద్దామనుకున్న కథకి .. 'ఫిదా' కథకి మధ్య కొన్ని పోలికలు వున్నాయట. అందువలన ఇప్పట్లో ఈ సినిమా చేయకపోవడమే మంచిదని భావించి, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని వినికిడి. సౌజన్య మరో కథను సిద్ధం చేసుకునే పనిలో పడిందనీ .. చైతూ మరో ప్రాజెక్టును ఒప్పేసుకున్నాడని చెప్పుకుంటున్నారు.    

More Telugu News