navajuddin: 'బాబూ మోషాయ్ బందూక్ బాజ్' కి భారీగా కట్స్

ఇప్పుడు బాలీవుడ్ జనాలంతా 'బాబూ మోషాయ్ బందూక్ బాజ్' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. కుషన్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికి .. బిదితా బాగ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డువారు 48 కట్స్ ను సూచించారట. దాంతో ఈ సినిమా దర్శక నిర్మాతలు రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

 ఇన్ని కట్స్ సూచించడానికి కారణమేమిటని మీడియా వారు సెన్సార్ బోర్డు చీఫ్ 'నిహ్లానీ'ని అడగగా .. అభ్యంతరకర సన్నివేశాలు చాలా వున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతూ, తన పని తాను చేశాను .. అంతే అంటూ సింపుల్ గా సమాధానమిచ్చారు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 

More Telugu News