krishnavamsi: 'ఓ మణిరత్నం .. ఓ రాజమౌళి' అంటోన్న కృష్ణవంశీ!

కృష్ణవంశీ తెరకెక్కించిన 'నక్షత్రం' మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. రీసెంట్ గా ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ, ఇప్పటికీ తాను డైరెక్టర్ గా పాఠాలు నేర్చుకునే స్థాయిలోనే వున్నానని అన్నారు. కృష్ణవంశీ ఓ క్రియేటివ్ దర్శకుడు అనే మాటలను గురించి తాను పెద్దగా పట్టించుకోనని చెప్పారు. తనకి తాను ఇంకా రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ ననే అనుకుంటూ ఉంటానని అన్నారు.

'బాహుబలి' వంటి సినిమాలు చూసినప్పుడు దర్శకత్వమంటే ఇది అని అనిపిస్తూ ఉంటుంది. మణిరత్నం గారిలా ఓ సినిమా తీయాలని .. బాపు గారిలా ఒక పాటను చిత్రీకరించాలని ఉందని చెప్పారు. అలాంటి సినిమాలు చేసిన రోజున తాను దర్శకుడినేనని అనిపిస్తుందనీ .. అలా అనుకున్న రోజున ఇక సినిమాలు ఆపేసి వ్యవసాయం చేసుకుంటానని అన్నారు. తనని తాను తగ్గించుకోవడం కృష్ణవంశీకి గల మరో గొప్ప లక్షణమని అనిపించడం లేదూ!       

More Telugu News