: డ్రగ్స్ కు వ్యతిరేకంగా కదలాలని 'మా' పిలుపునిచ్చినా, పట్టించుకోని పెద్దలు!

'సే నో టూ డ్రగ్స్' పేరిట ప్రచారాన్ని నిర్వహించాలని తలచిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) మరో సంస్థతో కలసి ఈ ఉదయం హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద ప్రత్యేక ర్యాలీని నిర్వహించగా, సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన కనిపించక పోవడం గమనార్హం. స్వయంగా 'మా' పిలుపునిచ్చినా, పరిశ్రమ పెద్దలు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. రాజశేఖర్, జీవిత తప్ప ఇండస్ట్రీ వారెవరూ ఈ ర్యాలీలో కనిపించలేదు.

కొంతమంది టీవీ ఆర్టిస్టులు, సుమ వంటి యాంకర్లు కొందరు హాజరయ్యారు. ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని, డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News