mohan babu: మోహన్ బాబు కథానాయకుడిగా మొదలైన 'గాయత్రి'

ఒక వైపున మంచు విష్ణు .. మరో వైపున మంచు మనోజ్ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో కథానాయకుడిగా మోహన్ బాబు స్పీడ్ తగ్గించారు. అలా కొంత గ్యాప్ తరువాత కథానాయకుడిగా మళ్లీ రంగంలోకి దిగారు. ఈ సినిమాకి 'గాయత్రి' అనే టైటిల్ ను ఖరారు చేసి .. నిన్ననే హైదరాబాద్ లో లాంచ్ చేశారు.

మదన్ దర్శకత్వంలో మోహన్ బాబు సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆయన మనవరాళ్లు అరియానా - వివియానా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ కెమెరా స్విచ్చాన్ చేసింది. తొలి సన్నివేశానికి మదన్ దర్శకత్వం వహించాడు. ఇదొక విభిన్నమైన కథా చిత్రమనీ .. అందుకే ఈ సినిమా చేయడానికి మోహన్ బాబు ఉత్సాహాన్ని చూపారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.    
 

More Telugu News