: ముఖేష్ అంబానీపై పోలీసులకు పొరుగింటి వ్యక్తి ఫిర్యాదు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం 'అంటిల్లా' నుంచి చెవులు చిల్లులు పడే శబ్దాలు వస్తున్నాయని, ఆయన పొరుగింట్లో ఉండే ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రుళ్లు సంగీతంతో తమకు నిద్రలేకుండా చేస్తున్నారని, ముఖేష్, ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఫిర్యాదు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఫిర్యాదు అందుకున్న తాము తనిఖీలకు వెళ్లిన సమయంలో మాత్రం ఎటువంటి ధ్వనులూ వినిపించలేదని వారు వెల్లడించారు. కేసును విచారిస్తామని అన్నారు.

More Telugu News