: విక్రమ్ గౌడ్ పై కాల్పులు భార్య షిఫాలీ పనేనా? లేక ఆత్మహత్యాయత్నమా?... కొత్త కోణంలో విచారణ!

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిగిన ఘటన ఈ ఉదయం హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపగా, విచారణ ప్రారంభించిన పోలీసులు ఇది బయటి నుంచి వచ్చిన వ్యక్తుల పని ఎంతమాత్రమూ కాదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించిన అనంతరం టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మాట్లాడుతూ, తెలిసిన వ్యక్తే మాట్లాడేందుకు ముందే వచ్చి, మాటా మాటా పెరిగి, ఘర్షణ జరిగి కాల్పులు జరిగాయా? అన్న కోణంలో విచారిస్తున్నామన్నారు. భార్యతో విభేదాలు ఉన్నట్టు వచ్చిన వార్తలపైనా ప్రశ్నిస్తున్నామని అన్నారు. కుటుంబంలోని విభేదాల కారణంగా విక్రమ్ గౌడ్ తనంతట తానుగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నామని తెలిపారు.

More Telugu News