: తెలంగాణ ప్రభుత్వం నుంచి మినహాయింపులు పొందారు: వెంకయ్యనాయుడిపై జైరాం రమేష్ ఆరోపణలు

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడిపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తన ట్రస్టుకు వెంకయ్య మినహాయింపులు పొందారని ఆరోపించారు. అలాగే హర్ష టయోటా కార్ షోరూమ్ లు వెంకయ్య కుమారుడికి చెందినవని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ షోరూమ్ ల నుంచే భారీ ఎత్తున కార్లను కొనుగోలు చేసిందని... కనీసం టెండర్లు కూడా వేయకుండానే వీటిని కొన్నారని మండిపడ్డారు. 

More Telugu News